top of page

🏃‍♂️💨 తెలంగాణలో స్పీడు పెంచుతున్న కాంగ్రెస్‌...

🏛️🗳️ హైదరాబాద్, ఆగస్టు 14: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ వేగం పెంచింది. 🚀 తిరగబడదాం, తరిమికొడదాం అంటూ సరికొత్త నినాదంతో ఎన్నికలకు రెడీ అవుతోంది. 💪 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజా కోర్ట్‌లు నిర్వహించాలని నిర్ణయించిన కాంగ్రెస్‌... 🗳️

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అంశాల వారీగా ప్రచారం చేసేలా కార్యాచరణకు సిద్ధమవుతోంది. 🌐 ప్రచారంలో ప్రజలను కూడా భాగస్వాములను చేస్తూ ప్రచారం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. 🗣️ తెలంగాణలోనూ కర్నాటక తరహా వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తున్న కాంగ్రెస్‌... 🌐 ఇవాళ జరిగే స్క్రీనింగ్‌ కమిటీ భేటీలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

🏛️ ఇవాళ గాంధీ భవన్‌లో జరిగే పీసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశం స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్‌ ఆధ్వర్యంలో జరగనుంది. 🤝 ఈ సమావేశంలో రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సహా పలువురు సీనియర్లు పాల్గొననున్నారు. 🤝 ఈ సందర్భంగా ఎన్నికల కార్యాచరణపై స్క్రీనింగ్ కమిటీ చర్చించనుంది. 🗳️ ఈ మేరకు మురళీధరన్‌ హైదరాబాద్‌ చేరుకోగా.. 🛬 శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రేవంత్‌, ఉత్తమ్ ఆయనకు స్వాగతం పలికారు. 🙌


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page