🏨📣 హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణా వేదికగా శనివారం, ఆదివారం సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి.
రెండ్రోజులపాటు జరగనున్న సమావేశాల కోసం హోటల్ తాజ్కృష్ణలో భారీ ఏర్పాట్లు చేసింది టీపీసీసీ. సీడబ్ల్యూసీ సమావేశాలు ముగిశాక.. తుక్కుగూడలో రేపు భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది కాంగ్రెస్. ఈ వేదిక నుంచే ఆరు గ్యారంటీ హామీలను ప్రకటించనున్నారు సోనియాగాంధీ. కాగా.. ఈ సభకు టీ కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 10 లక్షల మందిని తరలించాలని భావిస్తోంది. అందుకు తగినట్లుగా కేడర్ను సమాయత్తం చేసింది.
🏛️🗣️ సీడబ్ల్యూసీ సమావేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, మజిలీ ఎన్నికలు, ఇండియా కూటమి.. ప్రస్తుత రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం తీసుకోవాల్సిన చర్యలు.. తదితర అంశాలపై నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో దీనిలో కార్యచరణ రూపొందించనున్నట్లు సమాచారం.. అంతేకాకుండా ఇండియా కూటమిలో సీట్ల పంపకాల గురించి కూడా చర్చించనున్నారు కాంగ్రెస్ నేతలు... 🌟🔍
Comments