top of page
Suresh D

లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ ఎనిమిదో జాబితా విడుదల..🗳️

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. అభ్యర్థుల ఖరారు ప్రక్రియను పూర్తి చేస్తున్నాయి అన్ని పార్టీలు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థుల ఎనిమిదో జాబితాను విడుదల చేసింది. బుధవారం (మార్చి 27, 2024) రాత్రి ఆలస్యంగా వచ్చిన ఈ జాబితాలో మొత్తం 14 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ స్థానాలకు సంబంధించి మొత్తం నాలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను ప్రకటించారు.కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై మధ్యప్రదేశ్‌లోని గుణ స్థానం నుంచి రావ్ యద్వేంద్ర సింగ్‌కు అవకాశం ఇవ్వగా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ విదిశా నుంచి ప్రతాప్ భాను శర్మను పోటీకి దింపింది. ఇక తెలంగాణలో ఉన్న మొత్తం 17 స్థానాలకు గాను ఇప్పటికే 9 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయగా.. తాజాగా మరో నలుగురితో జాబితాను ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ స్థానాలకు మాత్రమే తెలంగాణలో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.🗳️

bottom of page