top of page

కమిటీ కుర్రాళ్లు పవన్‌కల్యాణ్‌ను మీట్‌ అవుతున్నారా..?


కమిటీ కుర్రాళ్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కలిసి త్వరలోనే ఆయన అభినందనలు అందుకోబోతున్నారట. ప్రముఖ నటుడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల పింక్‌ ఎలిఫెంట్‌ పతాకంపై నిర్మించిన చిత్రం కమిటీ కుర్రాళ్లు.. ఆగస్టు 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. యదు వంశీ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో దాదాపుగా అంతా కొత్త ఆర్టిస్టులే నటించారు. అయతే ఈ చిత్రం విడుదలై మంచి టాక్‌నే తెచ్చుకుంది. ప్రేమ, స్నేహాం, పల్లెటూరి అనుబంధాలు ముఖ్య అంశాలుగా రూపొందిన ఈ చిత్రానికి మంచి ఫీల్‌ గుడ్‌ ఎంటైర్‌టైనర్‌గా పేరు వచ్చింది. అయితే అందుకు తగ్గ కలెక్షన్లు మాత్రం రాలేదు. అయితే కమిటీ కుర్రాళ్లు మాత్రం ఎక్కడా కూడా తన ప్రమోషన్‌ జోరును ఆపలేదు.

ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవిని కలిసి కూడా అభినందనలు అందుకున్నారు. అయితే ఒక వారం గ్యాప్‌ తరువాత అంటే ఆగస్టు 15న గీతా ఆర్ట్స్‌ నుండి అంతా కొత్త వాళ్లతో బన్నీవాసు నిర్మించిన ఆయ్‌ ప్రేక్షకుల ముందుకొచ్చింది. నార్నే నితిన్‌, నయన్‌ సారిక జంటగా నటించిన ఈ చిత్రానికి ఫుల్‌ ఫన్‌ ఎంటర్‌టైనర్‌గా అభినందనలు అందుకుంది. అయితే వసూళ్లు టాక్‌కు తగిన విధంగా లేవనే ఆయ్‌ టీమ్‌ కూడా ప్రమోషన్‌ను వదల్లేదు.

ఇటీవల జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలిసిన ఆయ్‌ టీమ్‌.. ఇప్పుడు తాజాగా ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ను కలిసి అభినందనలు అందుకుంది. ఇక ఇప్పుడు వీళ్లు అల్లు అర్జున్‌కు కలిశారు కాబట్టి మెగా కాంపౌండ్‌లో రూపొందిన కమిటీకుర్రాళ్లు ఇప్పుడు పవన్‌కల్యాణ్‌ను కలవాలనే ప్రయత్నాల్లో వున్నారని సమాచారం.

మొదటి నుంచి కమిటి కుర్రాళ్లు, ఆయ్‌ల మధ్య పోటి కొనసాగుతుంది. కలెక్షన్ల పరంగానే కాకుండా ప్రమోషన్స్‌ పరంగా కూడా ఈ ఇరువురి సినిమాలు పోటీపడుతున్నారు. ఆయ్‌ సినిమా టీమ్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలవగానే కమిటి కుర్రాళ్లు చిరంజీవిని కలిసి అభినందనలు అందుకుంది. సో.. ఇప్పుడు ఆయ్‌ టీమ్‌ అల్లు అర్జున్‌ను కలిశారు. సో.. కమిటికుర్రాళ్ల టీమ్‌ను తన బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ను కలిపించలనే ప్రయత్నాల్లో వున్నారు నిహారిక. సో.. ఆల్‌దిబెస్ట్‌ టూ టీమ్స్‌..




Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page