top of page

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముర్ కు ఘనస్వాగతం పలికిన సీఎం కేసీఆర్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా... హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము‌కి ఘనస్వాగతం పలికారు ముఖ్యమంత్రి కేచంద్రశేఖర్ రావు.

ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ వెంట.. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్, శంభీపూర్ రాజు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనికుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మేడ్చల్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.అదే సందర్భంలో.. రాష్టప్రతికి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు కూడా స్వాగతం పలికారు.గచ్చిబౌలి ఇండోర్ స్టేడియ స్టేడియంలో మధ్యాహ్నం జరిగే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు ఉత్సవాలకు రాష్టప్రతితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గోనున్నారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page