ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో కనువినీ ఎరుగని రీతిలో సగర్వంగా సౌత్ ఇండియాన్ ఫిల్మ్ ఫెస్టివల్ను నిర్వహించబోతున్నారు.
ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో కనువినీ ఎరుగని రీతిలో సగర్వంగా సౌత్ ఇండియాన్ ఫిల్మ్ ఫెస్టివల్ను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమ తరపున మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతగా సినిమాపట్ల అంకిత భావం, ప్రావీణ్యత వంటి లక్షణాలున చిరంజీవి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవుతుండటం అనేది సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు యంగ్ టాలెంట్ను ఎంకరేజ్ చేయటంలో ఎలాంటి నిబద్ధను కలిగి ఉన్నారనే అంశాన్ని తెలియజేస్తోంది. ఇలాంటి ఉత్సవాన్ని నిర్వహించటం అనేది ఔత్సాహిక నిర్మాతలకు, సినీ ప్రముఖులకు మరింత స్ఫూర్తిదాయకంగా ఉంది.మన సౌత్ ఇండియన్ సినిమాకు సంబంధించిన ఉత్తేజకరమైన ప్రయాణంలో మీరు భాగం కావటానికి మీరు సిద్ధమవండి. అందుకోసం మార్చి 22వ తేదీని మీ క్యాలెండర్లో ప్రత్యేకంగా మార్క్ చేసుకోండి. ఇందులో పాల్గొనాల్సినవారు బుక్ మై షోలో ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవచ్చు..🎥✨