top of page

ఆ డైరెక్టర్‌ సెట్‌లో అరిచేశారు..చిరంజీవి🎥


చిరంజీవి, విజయ్ దేవరకొండ వంటి వారు డిజిటల్ మీడియా ఫెడరేషన్ అంటూ జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ ఎన్నో రకాల ప్రశ్నలు అడిగి.. చిరంజీవి నుంచి ఎన్నో విలువైన సూచనలు, సలహాలను అందరికీ తెలిసేలా చేశాడు. చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఘటనలు, నిరుత్సాహ పడ్డ సంఘటనలు, వాటి నుంచి విజయం వైపు కసిగా వేసిన అడుగులు ఇలా ఎన్నెన్నో సంగతుల మీద చిరంజీవి స్పందించాడు. మెగాస్టార్ చెప్పిన ఆ విశేషాల్లోంచి న్యాయం కావాలి సినిమా షూటింగ్ టైంలో జరిగిన ఘటన అందరినీ ఆకట్టుకుంటోంది.న్యాయం కావాలి సినిమా షూటింగ్ జరుగుతోందట. రాధిక, శారద, జగ్గయ్య వంటి వారితో కోర్టు సీన్ ఉందట. డైరెక్టర్ క్రాంతి కుమార్ రోప్‌తో మీద ఉన్నారట. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి షాట్ రెడీ అయిందని చెప్పడంతో.. చిరంజీవి వెళ్లి బోనుల నిల్చున్నాడట. ఏంటి? ఇంత లేటు.. నువ్వేమైనా పెద్ద సూపర్ స్టార్ అనుకుంటున్నావా? నీ కోసం వెయిట్ చేయాలా? అని చిరంజీవి మీద పెద్ద పెద్దగా అరిచేస్తున్నాడట. అలా పైనుంచి అరిచేస్తుండటంతో.. వందల మంది జూ ఆర్టిస్టుల మధ్య తనకు ఏదోలా అనిపించిందట.


ఇలా అన్నాడేంటి? అని చిరంజీవి బాధపడ్డాడట. సాయంత్రం క్రాంతి కుమార్ ఫోన్ చేసి.. శారద రీల్స్ బాగా తినేస్తోందని.. ఆ కోపంలో ఏదో అన్నానని సారీ చెప్పాడట. కానీ క్రాంతి కుమార్ అన్న మాటల్లో ఓ మాటను మాత్రం బాగా గుర్తు పెట్టుకున్నాడట చిరంజీవి. నువ్వేమైనా పెద్ద స్టార్ అని అనుకుంటున్నావా? అని అన్నారు కదా? స్టార్ అయ్యి చూపిస్తాను అని ఇంకా కసితో పని చేశాడట.అలా ఎవరైనా అన్నా.. అవమాన పర్చినా, నిరుత్సాహ పర్చినా కూడా రెట్టింపు ఉత్సాహం, కసితో పని చేయాలని చిరంజీవి సలహా ఇచ్చాడు. అలా న్యాయం కావాలి సినిమా షూటింగ్‌లో జరిగిన ఘటన గురించి చిరంజీవి చెప్పుకొచ్చాడు. పాండీ బజార్‌లో ఎక్కువగా నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తుండేవని, అందుకే అటు వైపు వెళ్లేవాడ్ని కాదని,ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్‌తోనే ఉండాలని చిరంజీవి సలహా ఇచ్చాడు.🎥

bottom of page