top of page
MediaFx

ఎంతో గర్వంగా ఉంది.. సుష్మితపై చిరు ట్వీట్

చిరంజీవి సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండరన్న సంగతి తెలిసిందే. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ట్వీట్లు గానీ, పోస్టులు గానీ వేస్తుంటారు. ఇక తాజాగా చిరంజీవి తన కూతురు సుష్మిత నిర్మించిన వెబ్ సిరీస్ గురించి మాట్లాడారు. సుష్మిత తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద తీసిన పరువు వెబ్ సిరీస్ గత వారం నుంచి జీ5లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. నాగబాబు, నివేదా పేతురాజ్ వంటి వారి నటన గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు ఓటీటీలో మంచి స్పందన వస్తోంది.

పరువు వెబ్ సిరీస్ ఓటీటీలో బ్లాక్ బస్టర్ అవ్వడంతో చిరంజీవి తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఓటీటీలో ఇలాంటి అద్భుతమైన కంటెంట్‌ను ఇస్తున్న తన కూతుర్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందన్నారు. ఇక తన ప్రియమైన తమ్ముడు నాగబాబు అద్భుతమైన నటన గురించి అంతా మాట్లాడుకుంటున్నారని అన్నారు. అలా రెండో సీజన్ కోసం కూడా ఎదురుచూస్తున్నాను అని చెప్పేశారు. ఒక చక్కటి ప్లాన్‌తో చందు బాడీ మాయం చేసి, ఆ జంట పడే తిప్పలు, అదే విషయమై ఎమ్మెల్యే గారి పాట్లు. చివరకి ఈ జంట తప్పించుకుందా లేదా అని రెండో సీజన్‌లోనే చూడాలనుకుంటా అని చిరంజీవి తన ఎగ్జైట్మెంట్‌ను పంచుకున్నారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సెట్స్‌లో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. నిర్విరామంగా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ మూవీని పూర్తి చేసిన వెంటనే సుష్మిత నిర్మాణంలో చిరంజీవి నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కిస్తారు. కానీ ఇంత వరకు ఈ మూవీకి సంబంధించిన దర్శకుడు అయితే ఫిక్స్ కాలేదు. ఆ మధ్య కాలంలో కళ్యాణ్ కృష్ణ పేరు వినిపించింది. కానీ ఇప్పుడు ఆ స్థానంలోకి హరీష్ శంకర్ వచ్చేలా కనిపిస్తున్నాడు.


bottom of page