top of page

బంగ్లా, ఇంగ్లండ్‌ సిరీస్‌లకు వేదికలు మార్పు..


స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌తో పాటు టీమ్‌ఇండియా వచ్చే ఏడాది ఇంగ్లండ్‌తో ఆడనున్న సిరీస్‌ వేదికల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 6న ధర్మశాల వేదికగా భారత జట్టు తొలి టీ20 ఆడాల్సి ఉండగా స్టేడియంలో మరమ్మతుల కారణంగా ఆ మ్యాచ్‌ను గ్వాలియర్‌ (మధ్యప్రదేశ్‌)కు తరలించారు. మిగిలిన మ్యాచ్‌లలో మార్పులేమీ లేవు. ఇక తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా 2025 జనవరి 22న చెన్నైలో మొదటి, 25న కోల్‌కతాలో రెండో మ్యాచ్‌ జరుగాల్సి ఉంది. కానీ ఈడెన్‌ గార్డెన్‌లో తొలి టీ20, చెపాక్‌లో రెండో టీ20 జరుగుతాయని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page