top of page

రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్‌..🚄

🚆 దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 🚆📰🍽️ ఎంపిక చేసిన కొన్ని రైల్వే స్టేషన్స్‌లో తక్కు ధరలో ఆహారాన్ని అందిస్తున్నారు. 🛤🍽️ జనరల్‌ కోచ్‌లలో ప్రయాణించే వారికి లాభం చేకూర్చే ఉద్దేశంతో నాణ్యమైన ఎకానమీ మీల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

🚆 దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 🚆📰🍽️ ఎంపిక చేసిన కొన్ని రైల్వే స్టేషన్స్‌లో తక్కు ధరలో ఆహారాన్ని అందిస్తున్నారు. 🛤🍽️ జనరల్‌ కోచ్‌లలో ప్రయాణించే వారికి లాభం చేకూర్చే ఉద్దేశంతో నాణ్యమైన ఎకానమీ మీల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మీల్స్‌లో రెండు రకాల భోజనాన్ని అందిస్తున్నారు. 🍽️🍲💰 ఎకానమీ భోజనం రూ. 20 కాగా, కాంబో భోజనం రూ. 50గా నిర్ణయించారు. 💲🍽️💰 ఈ మీల్స్‌ రైల్వే స్టేషన్స్‌లో ఉండే ఇండియన్‌ రైల్వే టూరిజం అండ్‌ క్యాటరింగ్ సర్వీస్‌ (ఐఆర్‌సీటీసీ)కి చెందిన కిచెన్‌ యూనిట్లు, జన్‌ ఆహార్‌ సర్వీస్‌ కౌంటర్లలో లభిస్తాయి. జనరల్‌ కోచ్‌లు ఆగే ప్రదేశంలో ప్లాట్‌ఫామ్‌పై ఈ సర్వీస్‌ కౌంటర్లు ఉంటాయి. ఎక్కువ మంది ప్రయాణికులు ఈ సేవలను ఉపయోగించుకునేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేశారు. ఈ ఎకానమీ మీల్స్‌ను తొలుత హైదరాబాద్‌, విజయవాడ, రేణిగుంట, గుంతకల్‌ రైల్వే స్టేషన్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సేవలు ఈ నాలుగు స్టేషన్స్‌లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చేశాయ్‌. 🚆 జనరల్ కోచ్‌లలో ప్రయాణించే వారికి సరసమైన ధరకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా రైల్వే శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 🍽భోజనం మెనులో సౌత్‌ ఇండియన్‌ వంటకాలు కూడా ఉన్నాయి. 🍛🍲🥘ఈ ఎకానమీ భోజనం ప్రయాణిలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ. అరుణ్‌ కుమార్‌ జైన్‌ అన్నారు. దీనిద్వారా ప్రయాణికులు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనాన్ని పొందగలరన్నారు. ప్రస్తుతం నాలుగు స్టేషన్స్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ సేవలు భవిష్యత్తులో ఇతర స్టేషన్స్‌లోనూ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.🍛🍲🥘


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page