top of page
Suresh D

కేసీఆర్‌కు మరో షాక్

కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు ఎంపీ కే కేశవరావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి. తాజాగా, మరో బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను వరంగల్ బరి నుంచి తప్పుకుంటున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కావ్య లేఖ రాశారు. బీఆర్ఎస్ నుంచి పోటీకి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల మీడియాలో వస్తున్న కథనాలు, అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కాం .. పార్టీ ప్రతిష్టను దిగజార్చాయన్నారు. జిల్లా నేతల మధ్య సమన్వయం సహకారం కొరవడ్డాయన్నారు. ఎవరికి వారే అన్నట్లు పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు కావ్య తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యకర్తలు తనను మన్నించాలని ఆ లేఖలో కావ్య పేర్కొన్నారు. కాగా, కడియం శ్రీహరితోపాటు కావ్య కూడా రేపు అంటే శుక్రవారం కాంగ్రెస్ పార్టీలోచేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

bottom of page