top of page

🔵📣 కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే.

📢 తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకిలోకి మరో ఎమ్మెల్యే చేరారు. అంతా ఊహించినట్టే భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ సీనియర్ నేత, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలోకి మారారు.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడు రోహిత్‌తో కలిసి సెప్టెంబర్ 28 గురువారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఆ ​​పార్టీ తెలంగాణ చీఫ్ ఎ రేవంత్ రెడ్డి సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఈరోజు పార్టీలో చేరారు.

🏛️ బీఆర్‌ఎస్‌ పనితీరులో ప్రజాస్వామ్యం, పారదర్శకత లేదని ఆరోపిస్తూ హనుమంతరావు ఇటీవల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు రాజీనామా లేఖను అందించారు. అలాగే పార్టీని టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌గా మార్చాలని ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. అధికార దాహంతో ఉన్న కొంతమంది వ్యక్తుల చేతుల్లో బీఆర్‌ఎస్ కీలుబొమ్మగా మారిందని హనుమంతరావు ఆరోపించిన సంగతి తెలిసిందే. 🇮🇳

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page