top of page

🔍 దూకుడు పెంచిన సీఎం కేసీఆర్.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు 🗣️

📆 తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 🚀 అగ్ర నాయకులు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిరోజూ నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ గులాబీ కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు. 🌹 ఇవాళ తాండూరు, కొడంగల్‌, మహబూబ్‌నగర్‌, పరిగిలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం షెడ్యూల్ ఉంది. 📆 తాజాగా ఆయన తాండూర్‌లో ప్రసంగించారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా ఆరు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఆయన స్పీడ్ పెంచారు. 🚗 అన్ని నియోజకవర్గాలను కవర్ చేసి ప్రజలను కారు పార్టీ వైపు మళ్లించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. 🎯 కాంగ్రెస్‌పై ఆయన ప్రధానంగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌కు అధికారం వస్తే జరగబోయే పరిస్థితులను వివరిస్తూ ఆయన ప్రచారం సాగుతుంది. 📢 ఇక మంగళవారం నిర్వహించిన మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట ఆశీర్వాద సభల్లో మరోసారి కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసిన గులాబీ బాస్..మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తుందన్నారు. 🎯🌹


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page