top of page
Suresh D

ఛీ.. ఛీ.. కాసుల కోసం కక్కుర్తి.. అన్నాచెల్లెళ్లు పెళ్లి!😨

పేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయం చేయడానికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పథకం పక్కదారిపడుతోంది. ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం ద్వారా వచ్చే డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతున్న ఘటనలు తరుచూ బయటపడుతున్నాయి. తాజాగా, ప్రభుత్వ సొమ్ముకోసం కక్కుర్తిపడి అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. చివరకు ఆ మహిళ భర్త ఫిర్యాదుతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అధికారులు దర్యాప్తు చేపట్టడంతో వారి బండారం బయటపడింది. మహారాజ్‌గంజ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకోగా.. ప్రభుత్వం అందజేసిన కానుకలను అధికారులు వెనక్కి తీసుకున్నారు.



bottom of page