డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు. ఆయన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్రాలతో సంచలనాలు సృష్టించారు. కానీ బాలీవుడ్ నటుడు ఆదిల్ హుస్సేన్ కబీర్ సింగ్లో నటించడం గురించి నెగటివ్గా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవగా, సందీప్ తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు.
ఆ కౌంటర్పై ఆదిల్ తాజాగా స్పందిస్తూ, "సందీప్ తనను ఆంగ్ లీ కంటే ఫేమస్ అనుకుంటున్నాడా? అలా అనుకుంటే నాకు ఏమి చెప్పాలో తెలియదు. అతను తీసిన సినిమాలు బాగా వసూళ్లు సాధించాయి, కాబట్టి అలా అనుకుంటున్నాడేమో. కబీర్ సింగ్ ఎంత వసూలు చేసిందో తెలియదు కానీ ఆంగ్ లీ తీసిన 'లైఫ్ ఆఫ్ పై' ₹5000 కోట్లకు పైగా వసూలు చేసింది. సందీప్ ముందు మాట్లాడే ముందు ఆలోచించాలి."
అదే ఇంటర్వ్యూలో "యానిమల్" సినిమాను చూడలేదని, ఆ సినిమాలో నటించడానికి ఎంత డబ్బు ఇచ్చినా నటించనని చెప్పారు. "సందీప్ చేసిన కామెంట్స్ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాటిలో అర్థం లేదు," అన్నారు ఆదిల్.