top of page

ఏపీలో భోళాశంకర్‌ టికెట్ ధరల పై కొనసాగుతోన్న రభస ..ఇదంతా అందువల్లే 🎬🎥

చిరంజీవి హీరోగా తెరకెక్కి తాజా చిత్రం భోళా శంకర్‌. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని శుక్రవారం (రేపు) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. విడుదలకు అంతా సిద్ధమైంది. అయితే తాజాగా భోళా శంకర్ సినిమా టికెట్ల రేట్ల పెంపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. సినిమా బడ్జెట్‌ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ టికెట్ల ధరలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వాన్ని అనుతమి కోరిన విషయం తెలిసిందే. అయితే ధరలు పెంచాలంటే చిత్ర నిర్మాణ వ్యయానికి సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించాలని ప్రభుత్వం సినిమా యూనిట్‌ను కోరింది అయితే ఇదంతా YSRCP ప్రతీకార చర్య గా అందరూ భావిస్తున్నారు .మొన్న వాల్తేరు వీరయ్య 200 డేస్ ఫంక్షన్ లో చిరంజీవి గారు ఎంతసేపు ఇండస్ట్రీ మీద పడతారు రోడ్ల గురించి ప్రత్యేక హోదా గురించి ఆలోచించండి అని AP సర్కారుకు చురకలు పెట్టడం వల్లే ఇదంతా వచ్చిందని ఫాన్స్ అంటున్నారు . 🎬🎥



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page