top of page

🔍🚨 బీజేపీ అధికారంలోకి వస్తే, గల్ఫ్ వలస కార్మికుల బాధలకు చెక్..🔍

బతుకు దెరువుకు వేరే దేశాలకు వెళ్ళే భారతీయులకు భారతీయ జనతా పార్టీ అండగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

జీవనోపాధి వెతుక్కుంటూ ఇతర దేశాలకు వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారని, సరియైన ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించేందుకు కృషీ చేస్తామన్నారు. వారి సంక్షేమానికి కృషి చేసేలా ప్రత్యేక NRI మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆర్మూర్ నియోజకవర్గంలో నిర్వహించిన బీజేపీ బహిరంగసభలో కేంద్ర హోంమత్రి పాల్గొన్నారు.🌐 ఉపాధి వెతుక్కుంటూ గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారని, సరియైన ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించేందుకు కృషీ చేస్తామన్నారు. వారి సంక్షేమానికి కృషి చేసేలా ప్రత్యేక NRI మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఇప్పటికే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించామన్న అమిత్ షా, దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానం నిలబెడతామన్నారు అమిత్ షా.👨‍🌾 ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుటుంబ పాలనకు ప్రాధాన్యత ఇస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా పరిపాలన సాగించిన రెండు పార్టీలు – బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయని ఆయన ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతి పరులను జైల్లో పెడతామన్నారు. 🚜💔



Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page