top of page

‘సింహానికి ఆకలెక్కువ.. పల్లవి ప్రశాంత్‌కు పవర్ ఎక్కువ..’

🏠 బిగ్ బస్ హౌస్ లో నామినేషన్స్ మొదలయ్యాయి. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు నో చివరివరకు తీసుకు వచ్చి నో ఎలిమినేషన్ అని షాక్ ఇచ్చారు నాగ్.

దాంతో అశ్విని, గౌతమ్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక సోమవారం కావడంతో నామినేషన్ మొదలు పెట్టాడు బిగ్ బాస్. ఈసారి హౌస్ లో ఉండే వారిని ఓ జంగల్ సెటప్ లోకి తీసుకువెళ్లి అక్కడ ఒక సింహం బొమ్మను ఉంచాడు. ఆ సింహం చాలా ఆకలిగా ఉంది. హౌస్ లో ఉండటానికి ఎవరైతే అనర్హులు అనుకుంటున్నారో వారు ఇద్దరిని నామినేట్ చేయాలి వారి ఫోటోలను అతికించి ఉన్న మాంసం ముక్కలను సింహం నోట్లో వేయాలి అని చెప్పాడు బిగ్ బాస్. ముందుగా వదిలిన ప్రోమోలో అమర్ యావర్ మధ్య గొడవ జరిగినట్టు చూపించారు. ఆతర్వాత అర్జున్ కూడా యావర్ ను నామినేట్ చేశాడు. గౌతమ్ , ప్రశాంత్ ను నామినేట్ చేశాడు. ఈ క్రమంలో యావర్, గౌతమ్ , ప్రశాంత్ మధ్య వాదన జరిగింది. 🦁


Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page