top of page

శివాజీ పై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన నాగార్జున 🕵️‍♂️

నిన్నటి ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున వరుసగా హౌస్ లో ఉన్నవారిని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి మరీ క్లాస్ తీసుకున్నారు. కాస్త సీరియస్ గానే నిన్నటి ఎపిసోడ్ జరిగిందని చెప్పాలి. 🎭

ముందుగా శోభా శెట్టిని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచిన నాగార్జున ఆమె పై సీరియస్ అయ్యారు. సంచలక్ గా ఉంది ప్రియాంకాకు సపోర్ట్ చేయడం పై నాగార్జున ఫైర్ అయ్యారు. శోభా శెట్టి ఎదో కవర్ చేయడానికి ట్రై చేసింది కానీ వర్కౌట్ కాలేదు. 🤔 దాంతో చివరకు కన్నీళ్లు కూడా పెట్టుకుంది. దాంతో చేసేదేం లేక ఆమెకు దైర్యం చెప్పి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అనే ఫీలింగ్ ఇక్కడ ఏం లేదు.. నువ్వు మా మోనితవి, మా శోభా శెట్టివే అంటూ ఓ డైలాగ్ కొట్టి పంపించేశారు. 🗣️ ఆతర్వాత యావర్ ను ఛీ.. తూ.. అనడం పై క్లాస్ తీసుకున్నారు. శోభా కు యావర్ సారి చెప్పాల్సిందే అని అన్నారు నాగార్జున. ఆతర్వాత పల్లవి ప్రశాంత్ పై కూడా సీరియస్ అయ్యారు నాగ్.

నిజంగా కొరికాడా అమర్ నిన్ను.. ఏది ఇప్పుడు చూపించు.. అంటూ అడిగాడు నాగార్జున. 🤨 దీంతో చేయి చూపించాడు ప్రశాంత్.. గేమ్ ఆడే సమయంలో నువ్వు అమర్ మెడ పట్టుకున్నావ్ దాంతో ఎదో అలా జరిగింది అని అన్నారు. లేదు సార్ కోరినప్పుడు వాపు కూడా వచ్చింది డాక్టర్ ట్యాబ్లేట్లు కూడా ఇచ్చారు అని చెప్పాడు ప్రశాంత్. దానికి నేను డాక్టర్ ను అడిగాను ప్రశాంత్.. నో మర్క్స్ , నో బ్లెడ్ అని చెప్పారు అన్నాడు నాగార్జున. ఆతర్వాత శివాజీకి ప్రశాంత్ సేవలు చేయడం పై సీరియస్ అయ్యారు. గులాం గిరి చేయడానికి వచ్చావా.. ఆట మీద దృష్టి పెట్టు అంటూ క్లాస్ తీసుకున్నారు నాగార్జున. 🏏

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page