top of page

🌾👨‍🌾 రైతుబిడ్డపై రెచ్చిపోయిన అర్జున్.. దెబ్బకు బిత్తరి చూపులు చూసిన ప్రశాంత్ 🚜👨‍🌾

పల్లవి ప్రశాంత్ అర్జున్ ను నామినేట్ చేశాడు. తనను నామినేట్ చేసిన పాయింట్ గురించి చెప్తూనే అర్జున్ ను నామినేట్ చేశాడు ప్రశాంత్..

దాంతో అర్జున్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. ఆతర్వాత శోభా శెట్టి పై అశ్విని సీరియస్ అవ్వడం చూపించారు. మధ్యలో ఎందుకు దూరుతున్నావ్ అంటూ శోభా పై సీరియస్ అయ్యింది అశ్విని.

ఆతర్వాత అమర్ దీప్, యావర్ ను నామినేట్ చేశాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అలాగే శోభా శెట్టి కూడా యావర్ ను నామినేట్ చేసింది. దాంతో యావర్ మళ్లీ శోబాతో గొడవ పడ్డాడు. ఇక అర్జున్ , ప్రశాంత్ మధ్య మళ్లీ గొడవ జరిగింది. నేను చెప్పేది తప్పు అనడానికి నువ్వెవర్రా..? అని అర్జున్ అడిగితే వెళ్లి గూగుల్ ని అడుగు అని ప్రశాంత్ దురుసుగా సమాధానం చెప్పాడు. దాంతో అర్జున్ ఒక్కసారిగా మండిపడ్డాడు. పల్లవి ప్రశాంత్ నన్ను నామినేట్ చేస్తే నేను అడుగుతా వేరేవాళ్లను ఎందుకు అడుగుతా రా..? అని ఫైర్ అయ్యాడు. ఆతర్వాత నామినేట్ చేసిన వాళ్ల తలపై బాటిల్స్ పగల గొట్టారు. చివరిలో అమర్ దీప్ ఒక్క నిమిషం అంటూ వచ్చి అందరికి దీపావళి శుభాకాంక్షలు గెట్ ఏ బ్లాస్ట్ అని చెప్పాడు. 🌟🏆


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page