top of page

🌾📉 మార్కెట్‌లోకి భార‌త్ రైస్ .. కిలో రూ.29 లే.! 📉🌾

🇮🇳 దేశంలో బియ్యం ధ‌ర‌లు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న ధ‌ర‌ల‌కు క‌ళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. 🌾

భార‌త్ బ్రాండ్ పేరుతో కిలో బియ్యాన్ని 29 రూపాయలకే విక్రయించాల‌ని నిర్ణయించింది. 🛒 స‌బ్సిడీ బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్, కేంద్రీయ భండార్ అవుట్‌లెట్ల ద్వారా విక్రయించ‌నున్నట్టు తెలుస్తోంది. 🛒 దీనిపై త్వరలోనే అధికారిక ప్రక‌ట‌న వెలువ‌డుతుంద‌ని సీనియ‌ర్ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. 📣 ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గోధుమ‌పిండి, ప‌ప్పుధాన్యాల‌ను భార‌త్ ఆటా, భార‌త్ దాల్‌ పేరుతో త‌క్కువ‌ధ‌ర‌ల‌కే అందిస్తోంది. 🌾 న‌వంబ‌ర్‌లో తృణ‌ధాన్యాల ధ‌ర‌లు ప‌దిశాతం పైగా ఎగ‌బాక‌డంతో ఆహార ద్రవ్యోల్బ‌ణం 8.7 శాతానికి పెరిగింది. 📈 ద్రవ్యోల్బ‌ణం క‌ట్టడికి, దేశంలో బియ్యం ల‌భ్యత‌ను పెంచేందుకు కేంద్రం భార‌త్ రైస్ పేరిట స‌బ్సిడీ ధ‌ర‌కే బియ్యం అందించాల‌ని నిర్ణయించింది. 🤝 లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

bottom of page