top of page
Suresh D

రామయ్య భక్తులకు గుడ్ న్యూస్..🕉️

శ్రీరామనవమి అంటేనే ఊరూ వాడా సంబరం.. ఇక తెలుగువారి అయోధ్య భద్రాద్రిలో శ్రీ రామ నవమి వేడుకలు అంటే చాలు కల్యాణ కాంతులతో కళకళలాడే పరిసరాలు దర్శనం ఇస్తాయి.

దక్షిణాది అయోద్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీరామనవమి సందర్భంగా భక్తులతో పోటెత్తనుంది. క్రోధి నామ సంవత్సరం శ్రీ రామ నవమి వేడుకలను పురస్కరించుకుని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఉగాది పర్వదినం రోజున తిరువీడి సేవతో మొదలైన ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 వరకు జరుగనున్నాయి. ఈ,నేపథ్యంలో రామాలయ పరిసరాల్లో భక్తుల సందడి మొదలైంది. ఇప్పటికే భక్తుల కోసం ఆన్ లైన్ లో టికెట్లు, కౌంటర్ల వద్ద కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రోజులు శ్రీరామ నవమి. శ్రీ రామ మహా పట్టాభిషేక ఉత్సవం. ఏప్రిల్ 17వ తేదీ శ్రీ రామ నవమి రోజున శ్రీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అంతేకాదు 18 తేదీ అంటే శ్రీ రామనవమి మర్నాడు దశమి రోజు పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు అనేక ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు భద్రాచలం చేరుకుంటారు.

ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం శ్రీ సీతా రామచంద్రస్వామి దేవస్థానం బస చేసేందుకు వీలుగా గదులను ఆన్ లైన్ లోనే బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ నెల 17, 18 తేదీల్లో జరగనున్న ఉత్సవాల్లో పాల్గొనే భక్తులు ఆలయ వెబ్‌సైట్: https: //book.bhadrachalamonline.com/book-hotel. ద్వారా ఆన్ లైన్ లోనే గదులను రిజర్వ్ చేసుకోవచ్చు.🕉️

Comments


bottom of page