top of page

వైసీపీ గెలుస్తుందని రూ. 30 కోట్ల బెట్టింగ్.. చివరకు ఆత్మహత్య..!💔


ఏపీలో జరిగిన ఘోర సంఘటనలో, నూజివీడు మండలం తూర్పుదిగవల్లి గ్రామానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి ఎన్నికల బెట్టింగ్ లో ఓడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈయన, వైసీపీ గెలుస్తుందని ₹30 కోట్ల పందెం కాసారు.

పూర్తి వివరాలు: వైసీపీ మద్దతుదారుడైన వేణుగోపాల్ రెడ్డి, పార్టీ గెలుస్తుందని నమ్మకం వహించి, వివిధ గ్రామాల వారితో ₹30 కోట్ల పందెం కట్టారు. అయితే, వైసీపీ ఓటమి చెందిన తర్వాత ఊరినుంచి వెళ్లిపోయి, ఎవరికీ ఫోన్లు చేయలేదు.

జూన్ 7న, పందెం వేసిన వారు అతని ఇంటికి వెళ్లి ఏసీలు, సోఫాలు, మంచాలు తీసుకెళ్లారు. ఈ సంఘటన తెలుసుకున్న వేణుగోపాల్ రెడ్డి, మనోవేదనతో పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

పోలీసులు అతని మృతదేహం దగ్గర ఒక లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో చింతలపూడి మండలం నామవరానికి చెందిన ఓ వ్యక్తి తన మృతికి కారణమని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న వేణుగోపాల్ రెడ్డి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related Posts

See All

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page