top of page

🌟🎬 మహేశ్ కోసం అవతార్, జురాసిక్ పార్క్ డైరెక్టర్లు..🦖🎞️

హై రేంజ్ కాంబినేషన్ కావడంతో మహేశ్.. రాజమౌళి ప్రాజెక్టు స్టోరీ గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతోన్నాయి.

మరీ ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పటికే కొన్ని లైన్లు తెరపైకి వచ్చాయి. అయితే, ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీతో రాబోతుందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. దీంతో ఈ చిత్రాన్ని చాలా మంది ఇండియానా జోన్స్‌తో పోల్చుతున్నారు. రాజమౌళి - మహేశ్ బాబు సినిమాపై హాలీవుడ్ ఫోకస్ పడేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం ఏప్రిల్ 9న అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్, జురాసిక్ పార్క్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బెర్గ్‌తో ఈ సినిమాను అనౌన్స్ చేయించబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే రాజమౌళి కొడుకు కార్తికేయ వాళ్లతో చర్చించినట్లు తెలిసింది. అదే జరిగితే హాలీవుడ్ షేక్ అవడం ఖాయం.


bottom of page