జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా జట్టుకు ప్యాట్ కమిన్స్ సారథ్యం వహించట్లేదని ఆ జట్టు కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ పేర్కొన్నాడు.
2023లో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిష్, వన్డే వరల్డ్ కప్లో ఆసీస్ జట్టును కమిన్స్ గొప్పగా నడిపించిన సంగతి తెలిసిందే. రెండు ఫైనల్లో భారత్పై గెలిచి ట్రోఫీలు అందించాడు. కానీ టీ20 ఫార్మాట్లో కమిన్స్కు నాయకత్వ బాధ్యతలను ఆస్ట్రేలియా బోర్డు ఇవ్వాలనుకోవట్లేదు. అయితే గత కొన్నాళ్లుగా టీ20 జట్టుకు మిచెల్ మార్ష్ కెప్టెన్సీ నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల జరిగిన న్యూజిలాండ్ టీ20 సిరీస్లో జట్టును మార్ష్ నడిపించాడు. స్టీవ్ స్మిత్, ప్యాట్ కమిన్స్ జట్టులో ఉన్నప్పటికీ మిచెల్ మార్ష్నే సారథిగా సెలక్టర్లు ఎంపిక చేశారు. వన్డే, టెస్టు ఫార్మాట్లో కమిన్స్ గొప్ప ప్లేయర్ అయినప్పటికీ టీ20 ఫార్మాట్లో అతడు చేసిన అద్భుత ప్రదర్శనలు చాలా తక్కువ. అంతేకాకుండా పొట్టి ఫార్మాట్ తుదిజట్టులో కమిన్స్ ఉంటాడనే గ్యారంటీ కూడా లేదు. 🏆🇦🇺