top of page

ఇద్దరు సూపర్ స్టార్‏లతో ప్రేమాయణం.. చివరకు డాక్టర్‏తో రిలేషన్ షిప్..


దాదాపు రెండు దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమను ఏలిన ఈ నటి ఇద్దరు పెళ్లయిన నటులతో ప్రేమాయణం సాగిస్తోందనే రూమర్స్ వచ్చాయి. వైజయంతీ మాల, దిలీప్‌కుమార్‌ల జంట ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 1961లో ‘గంగా-జమున’ సెట్స్‌లో ఇద్దరూ సన్నిహితంగా మెలిగినట్లు సమాచారం. అయితే వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. కొన్నాళ్లకు వైజయంతి మాల జీవితంలోకి రాజ్ కపూర్ ప్రవేశించాడు. ఆ సమయంలో, రాజ్ కపూర్ హిందీ చిత్రసీమలో స్టార్ హీరో. రాజ్‌కి అప్పటికే కృష్ణ కపూర్‌తో వివాహమైంది. కానీ మరోసారి వైజయంతీమాలత ప్రేమలో పడ్డాడు రాజ్ కపూర్. వీరిద్దరు కలిసి నజరానా (1961), సంగం (1964) అనే రెండు చిత్రాలలో కలిసి పనిచేశారు. వీరిద్దరి ప్రేమ గురించి రాజ్ కపూర్ భార్యకు తెలియడంతో కొన్ని నెలలపాటు ఇద్దరి మధ్య గొడవలు జరగ్గా.. చివరకు రాజ్ కపూర్, వైజయంతీమాల విడిపోయారు. భవిష్యత్తులో వైజయంతిమాలతో కలిసి పనిచేయకూడదనే షరతు పెట్టింది రాజ్ కపూర్ భార్య. ఆ తర్వాత వైజయంతిమాలతో మళ్లీ పని చేయలేదు.


అయితే ఓ సినిమా షూటింగ్ సమయంలో వైజయంతిమాల దాల్ లేక్‌లో ఎక్కువ కాలం ఉండడం వల్ల న్యుమోనియా బారిన పడింది. ఆ తర్వాత రాజ్‌కపూర్‌కు కుటుంబ వైద్యుడు సాహెబ్ కిత్స అందించారు. అతడు వైజయంతిమాలకు పెద్ద అభిమాని. చికిత్స సమయంలో ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించారు. తర్వాత ఆ సంబంధం పెళ్లి వరకూ వెళ్లింది. అయితే డాక్టర్ సాహెబ్‌కి అప్పటికే పెళ్లయింది. దీంతో డాక్టర్ తన భార్యతో విడిపోవడానికి ఆమెకు వైజయంతీమాల పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించందని అప్పట్లో టాక్ నడిచింది. చివరకు వైజయంతి మాల, డాక్టర్ సాహెబ్ వివారం చేసుకున్నారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page