top of page
Suresh D

నా చెల్లెళ్ల‌తో న‌న్ను ఓడించ‌గ‌ల‌డా..?🗳️

టీడీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబుపై వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు. త‌న చెల్లెళ్ల‌ను ( వైఎస్ ష‌ర్మిల‌- వివేకా కుమార్తె సునీత‌) ప్ర‌యోగించి త‌న‌ను ఓడించాల‌ని చంద్ర‌బాబు కుట్రలు చేస్తున్నార‌ని..  అన్నారు. అంతే కాదు.. “నా చెల్లెళ్ల‌తో న‌న్ను ఓడించ‌గ‌ల‌డా?“ అని చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. శవరాజకీయాలు, కుట్రలు చంద్ర‌బాబుకు వెన్న‌తో పెట్టిన విద్య‌ల‌ని వ్యాఖ్యానించారు. “అలవాటు కుట్రలు చాలవన్నట్లు.. నా చెల్లెళ్లు ఇద్దరిని తీసుకొచ్చుకున్నారు.  ఆ దేవుడు, ఆ ప్రజల్నే నమ్ముకున్నా.. ధర్మం, న్యాయాన్ని నమ్ముకున్నా. న‌న్ను ఓడిచండం చంద్ర‌బాబుకు సాధ్యం కాదు“ అని జగన్ అన్నారు.🗳️

bottom of page