top of page
MediaFx

ఏపీ కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ..

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఇప్పటికే టికెట్ల పంచాయితీ పీక్ స్టేజ్‌లో ఉంది. టికెట్లు దక్కని పలువురు నేతలు ఆందోళనలు, ఆసంతృప్తి వ్యక్తం చేయడం లాంటివి పలు చోట్ల జరుగుతూనే ఉన్నాయి.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లోనూ ఇదే సీన్ రిపీటైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఇండియా కూటమి నాయకులతో ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వచ్చిన అనపర్తి, రాజానగరం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టకాలంలో కాంగ్రెస్ కోసం పనిచేసిన తమకు టిక్కెట్లు ఇవ్వలేదంటూ మండిపడ్డారు. గిడుగు రుద్రరాజు సమక్షంలోనే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

అయితే గిడుగు రుద్రరాజు మాత్రం అందరినీ కలుపుకుని పోతామనీ.. ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం కోసం పలువురు నేతలనూ తీసుకొస్తామని పేర్కొన్నారు.

Comments


bottom of page