top of page

📚💔 ఐఐటీ హైదరాబాద్‌లో మరో విద్యార్థిని ఆత్మహత్య..

🎓🏢 ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్‌ ఫస్టియర్‌ చదువుతోన్న విద్యార్థిని మమైత (20) నాయక్‌ మంగళవారం (ఆగస్టు 8) ఆత్మహత్యకు పాల్పడింది. 🎒💔 హాస్టల్‌లోని తన గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని విగత జీవిగా కనిపించింది. 👀🕯️

ఒడిశా రాష్ట్రానికి చెందిన విద్యార్ధిని మమైత ఐఐటీ క్యాంపస్‌లో ఎంటెక్‌ చదువుతోంది. 🎓🏞️ ఆమె జూలై 26న క్యాంపస్‌కు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఏం జరిగిందో తెలియదుగానీ ఒరియా భాషలో సూసైడ్‌ లెటర్‌ రాసి బలవణ్మరణానికి పాల్పడింది. 📝💔 హాస్టల్‌ సిబ్బంది సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గదిలోని సూసైడ్‌ లెటర్‌ స్వాధీనం చేసుకుని, విద్యార్ధిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 📞🚔 సంగారెడ్డి డీఎస్పీ పి రమేశ్‌కుమార్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మమైత ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 💡🧠 చదువులో ఒత్తిడికి గురి కావడం వల్లనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 💔🛑

🎓💔 ఐఐటీ విద్యార్థుల వరుసగా ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. 2022-23 ఏడాది వ్యవధిలోనే నలుగురు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 💔📅 చదువులు చదవలేక, ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు తనువుచాలిస్తున్నారు. 📚🚫 మరికొంతమంది విద్యార్ధులు పరీక్షల్లో ఫెయిల్ అవ్వడాన్ని జీర్ణించుకోలేక చావే శరణ్యమని భావిస్తున్నారు. 🎓💡

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page