top of page

మణిపూర్‌లో మరో ఘటన.. వ్యక్తి తలనరికి వేలాడదీసిన దుండగులు 😨😢



ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్న మణిపూర్‌లో మరో షాకింగ్ ఘటన బయటికి వచ్చింది.మెయితీ వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇందులో కుకీ తెగకు చెందిన నలుగురు వ్యక్తులను మెయితీ వర్గానికి చెందిన వారు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇందులో డేవిడ్ థీక్‌ అనే వ్యక్తి తలను నరికి.. మొండెం నుంచి వేరు చేశారు. అంతటితో ఆగకుండా అనంతరం అక్కడ వెదురు కర్రలతో చేసిన కంచెకు డేవిడ్ థీక్ తలను వేలాడదీశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారడంతో అసలు విషయం బయటికి వచ్చింది. 😱📹


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page