top of page

వన్‌ప్లస్‌ నుంచి మరో అద్భుతం.. కళ్లు చెదిరే ఫీచర్లతో కొత్త ఫోన్‌


వన్‌ప్లస్‌ వన్‌పల్స్‌ ఏస్‌5 సిరీస్‌ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. వన్‌ప్లస్‌ ఏస్‌5, వన్‌ప్లస్ ఏస్‌5 ప్రో పేర్లతో రెండు ఫోన్‌లను తీసుకొస్తున్నారు. చైనాలో ఏ ఏడాది చివరిలో ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయిత నెట్టింట ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని ఫీచర్స్‌ లీక్‌ అవుతున్నాయి. వీటి ప్రకారం ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌ను ఇవ్వనున్నారు.

వన్‌ప్లస్‌ ఏస్‌5 ఫోన్‌లో 6.78 ఇంచస్తో కూడిన మైక్రో కర్వ్‌డ్‌ స్క్రీన్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 1.5 కే రిజల్యూషన్‌తో ఈ స్క్రీన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్ రెయిర్‌ సెటప్‌తో కూడిన కెమెరాలను అందించనున్నట్లు తెలుస్తోంది. ఫ్రంట్‌ కెమెరాకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇక బ్యాటరీకి పెద్ద పీట వేసిన ఈ ఫోనలో 100 వాట్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌కు సపోర్ట చేసే 6200 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ధరకు సంబంధించి వివరాలు తెలియాల్సిందే. వచ్చే ఏడాది భారత్‌లో ఈ ఫోన్‌ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోది.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page