top of page
Suresh D

'యానిమల్' ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్..🎥✨



రణబీర్ కపూర్-రష్మిక మందన జంటగా నటించిన యానిమల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీసిన ఈ సినిమాకి బాలీవుడ్ ఆడియన్స్ పిచ్చెక్కిపోయారు. ఇక దీనికి సీక్వెల్‌‍గా రాబోతున్న యానిమల్ పార్క్ గురించి అంతా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కే పరిస్థితి కనిపించట్లేదు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌తో చేయబోతున్న 'స్పిరిట్' సినిమా పనిలో బిజీగా ఉన్నారు. స్పిరిట్‌ను పూర్తి చేసిన తర్వాతే యానిమల్ సీక్వెల్ అయిన యానిమల్ పార్క్ షూటింగ్ మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారట. దీంతో ఈ చిత్ర షూటింగ్ 2026లో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం సందీప్ స్పిరిట్ స్క్రిప్టుతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ 2024 చివరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.🎥✨

bottom of page