top of page
MediaFx

డెప్యుటేషన్‌పై ఉన్న అధికారులపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం 🚫

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెప్యుటేషన్‌పై ఉన్న అధికారుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. డెప్యుటేషన్‌పై ఉన్న అధికారులను రిలీవ్ చేయకూడదని నిర్ణయించింది. కొత్త ప్రభుత్వం రానున్న దృష్ట్యా ఈ ఆదేశాలు ఇచ్చింది. డెప్యుటేషన్‌పై ఉన్న పలువురు అధికారులు రిలీవ్ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు.

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవర రెడ్డి తమ మాతృ సంస్థలకు వెళ్లాలనుకున్నారు. గనులశాఖ ఎండీ వెంకటరెడ్డి, ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూదన్‌రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ రాజేశ్వర్‌రెడ్డి తమ బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని కోరారు. సమాచారశాఖ కమిషనర్ విజయ్‌కుమార్‌ రెడ్డి తక్షణం రిలీవ్ కావాలని కోరారు. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలంగాణకు వెళ్లాలని కోరారు. ఇంకా మరికొందరు కీలక శాఖల అధికారులు కూడా తెలంగాణకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు.

గతంలో టీడీపీ డెప్యుటేషన్‌పై ఉన్న అధికారులపై పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులకు సెలవులు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. టీటీడీ ఈవో ధర్మారెడ్డి సెలవుపై వెళ్తానంటూ దరఖాస్తు చేసుకోగా, ఆ దరఖాస్తును తిరస్కరించారు. సీఐడీ చీఫ్ సంజయ్ కూడా తన సెలవు ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు.

bottom of page