top of page

ఇసుకలో నిక్షిప్తమైన చారిత్రాత్మక ఆలయం ప్రభాస్ సినిమాతో వెలుగులోకి 🌟

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో పెన్నా నది తీరంలో ఇసుకలో నిక్షిప్తమైన నాగేశ్వర స్వామి ఆలయం తాజాగా వార్తల్లో నిలిచింది. 2020లో పెరుమాళ్లపాడు గ్రామం వద్ద తవ్వకాలలో బయటపడిన ఈ ఆలయం సుమారు 200 సంవత్సరాల పురాతనమైనదిగా అంచనా. పెన్నా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం దశాబ్దాలుగా ఇసుకలో కూరుకుపోయింది. 19వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడిన ఈ ఆలయం 1850 వరదల తర్వాత ఇసుకలో నిక్షిప్తమైంది. వందల ఎకరాల భూమి కింద ఉన్నట్లు భావిస్తున్నారు. వరదల కారణంగా ప్రజలు 200 సంవత్సరాల కిందట నది నుండి దూరంగా తమ నివాసాలను మార్చుకున్నారు. పురావస్తు అధికారులు ఇసుక తవ్వకాలను నిలిపివేసి ఆలయాన్ని పరిరక్షిస్తున్నారు. స్థానికులు ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన "కల్కి 2898 ఏడి" సినిమాలో ఈ ఆలయం ప్రస్తావన ఉండటంతో మరింత ప్రాచుర్యం పొందింది. చిత్రీకరణ కోసం ఈ ఆలయాన్ని ఉపయోగించారనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Related Posts

See All

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page