top of page

ఇండియా,ఇంగ్లండ్ ఐదో టెస్టుపై సందిగ్ధత🏏

భారత్‌-ఇంగ్లండ్‌ల మధ్య సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టు గురువారం (మార్చి 7) నుంచి ప్రారంభం కానుంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం సిరీస్‌లో టీమిండియా 3-1తో ముందంజలో ఉంది.

రోహిత్ సేన ఇప్పుడు చివరి టెస్టులో కూడా గెలిచి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో తొలి సిరీస్ ఓటమి తర్వాత ఇంగ్లాండ్ పునరాగమనం కోసం సాధన ప్రారంభించింది. దీంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగవచ్చు. అయితే ఈ ఉత్కంఠభరితమైన ఐదో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించవచ్చన్న నివేదికలు ఫ్యాన్స్ ను కలవరపెడుతున్నాయి. ధర్మశాలలో జరిగే ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌లు చాలా చలిగా ఉంటుంది. తొలిరోజు వర్షం కారణంగా మ్యాచ్‌ ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 3, 4 రోజులలో ఎండ ఎక్కువగా ఉంటుంది. కానీ 5వ రోజు మళ్లీ మేఘావృతమై ఉంటుంది. చివరి రోజు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. దీనికి తోడు వెలుతురు లేమీ ఆటకు అడ్డంకిగా మారవచ్చు. టీ తర్వాత ఫ్లడ్‌లైట్‌లను ఉపయోగించే అవకాశం ఉంది. 🌦️


bottom of page