🌟 టాలీవుడ్లో ఎందరో వారసులు వచ్చారు. కానీ ఇప్పుడు హైప్ క్రియేట్ చేస్తున్న వార్త ఏంటంటే.. ఇద్దరు స్టార్ హీరోల వారసులు ఒకేసారి ఒకే సినిమాలో తెరంగేట్రం చేయబోతున్నారని. ఈ ఇద్దరు తమ తండ్రులను మించిన సక్సెస్ సాధించేందుకు తొలిప్రయత్నంలోనే మల్టీస్టారర్ మూవీని ఎంచుకున్నారని అంటున్నారు. కథా చర్చలు జరుగుతున్నాయని.. సెట్స్పైకి రావడమే ఆలస్యమని సమాచారం. మరి ఈ ప్రచారంలో నిజమెంత? మల్టీస్టారర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ ఇద్దరు వారసులు ఎవరు?
టాలీవుడ్ టాప్ హీరోల్లో పవర్స్టార్ పవన్ ఒకరైతే.. సూపర్స్టార్ మహేశ్బాబు మరొకరు. ఈ ఇద్దరూ ఇప్పటికీ సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఐతే వీరి వారసులు అకీరా నందన్, గౌతం కృష్ణ తెరంగేట్రంపై టాలీవుడ్లో తెగ ప్రచారం అవుతోంది. ఈ ఇద్దరినీ ఒకే మూవీలో పరిచయం చేస్తారనే టాక్ అభిమానుల్లో క్రేజ్ పెంచుతోంది. అకీరా నందన్ ఇప్పటికే డిగ్రీ పూర్తి చేశాడు. తన సంగీత ప్రతిభను చాటాడు. ఇక గౌతమ్ కృష్ణ యాక్టింగ్ స్కిల్స్పై శిక్షణ కూడా తీసుకున్నాడు. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో అకీరా సినిమాపై ఇన్నాళ్లు ముందడుగు పడలేదని.. ఇప్పుడు ఏపీ ఎన్నికలు ముగియడంతో అకీరా సినిమాపై చర్చలు మొదలయ్యాయని టాక్ వినిపిస్తోంది.
అకీరా నందన్, గౌతమ్ కృష్ణ కలిసి మల్టీస్టారర్గా చిత్రం చేస్తే.. తెలుగు సినిమా మరో రేంజ్కు వెళుతుందంటున్నారు సినీ ప్రియులు. ఈ సినిమా షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ప్రస్తుతానికి టాప్ సీక్రెట్ అంటున్నారు. ఏదిఏమైనా అకీరా నందన్, గౌతమ్ కృష్ణ ఎంట్రీకి అంతా రెడీ అయినట్లేననేదే ఇప్పుడు ఇండస్ట్రీని కుదిపేస్తున్న హాట్ టాపిక్.