top of page

ఇది ప్రభాస్‌ బలగం..!ఆదిపురుషుడి ఆగమనంకు బడా స్టార్స్ తోడు..

ప్రభాస్ ఆదిపురుష్‌ మూవీ రిలీజ్ కు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సెల్రబిటీలందర్నీ తన వైపే కదిలేలా... పెద్ద మనసు చేసుకునేలా చేస్తోంది. పేద పిల్లలకు, అనాథ పిల్లలకు.. వింజువల్ వండర్గా తెరకెక్కిన రామాయణ గాథ ఆదిపురుష్‌ సెలబ్రిటీల కారణంగానే దగ్గరవుతోంది.

ఓం రౌత్ డైరెక్షన్లో.. అడ్వాన్స్‌డ్‌ మోషన్ క్యాప్చర్‌ టెక్నాలిజీతో తెరకెక్కిన ఆదిపురుష్‌ మూవీ జూన్‌ 16న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. దీంతో ఈ మూవీని… అనాథ పిల్లలకు.. పేద పిల్లలకు ఫ్రీగా చూపించాలనే ఉద్దేశ్యంతో.. ప్రొడ్యూసర్‌ అభిషేక్ అగర్వాల్.. రెండు మూడు రోజుల క్రితమే.. ఓ పదివేల టికెట్లను బుక్‌ చేసి నెట్టింట వైరల్ అయ్యారు. ఇక ఈ ప్రొడ్యూసర్‌ తర్వాత స్టార్ హీరో రణ్‌ బీర్ కపూర్ కూడా… పది వేల టికెట్లను.. పేద, అనాథ పిల్లలకు డిస్ట్రిబ్యూట్‌ చేసేందుకు ముందుకొచ్చారు. ఇదే బాలీవుడ్ నుంచి అనయ బిర్లా కూడా పది వేల టికెట్లను ఆర్పాన్ కిడ్స్‌ కోసం ఇవ్వనున్నట్లు తాజాగా తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఇక వీరికి తోడుగా… టాలీవుడ్‌ నుంచి తాజాగా మంచు మనోజ్‌ భూమా మౌనిక రెడ్డి జోడీ కూడా ముందుకొచ్చారు. తెలుగు టూ స్టేట్స్‌లో ఉన్న అనాథ పిల్లల కోసం దాదాపు 2500 ఆదిపురుష్‌ టికెట్లను తానే స్వయంగా బుక్‌ చేసి.. డిస్ట్రిబ్యూట్ చేస్తా అంటూ.. అనౌన్స్ చేశారు. ఇక మంచు మనోజ్‌ కు తోడు.. టాలీవుడ్ ఈవెంట్ మేనిజింగ్ కంపెనీ శ్రేయాస్ మీడియా కూడా… ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలోని దాదాపు అన్ని విలేజెస్‌లో ఉన్న రామాలయాలకు ఫ్రీగా 101 టికెట్లు అందించనున్నట్టు అనౌన్స్ చేశారు. అంటే అప్రాక్స్‌ లక్ష టికెట్లను ఫ్రీగా ఇవ్వనున్నారు. ఇక అఫీషియల్‌గా తెలవకపోయినప్పటికీ మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ కూడా ఆర్ఫాన్స్‌ కోసం పదివేల టికెట్స్‌ బుక్ చేసినట్టు ఇన్‌సైడ్‌ టాక్ కూడా ఉంది. ఇలా ఈ సెలబ్రిటీలు.. ఈ మైథలాజికల్ మాస్టార పీస్ ను ఆర్పాన్ కిడ్స్‌కు.. ఫ్రీ చూపించేందుకు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందరూ వారిని అప్రిషియేట్‌ చేసేలా చేస్తోంది. ప్రభాస్‌ బలగం అనే ట్యాగ్ నెట్టింట వీరికొస్తోంది.



留言


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page