top of page

శంషాబాద్‌లో దారుణం ఓ మహిళను చంపేసి బాడీపై పెట్రోల్‌ పోసి తగులబెట్టారు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. సాయి ఎన్‌క్లేవ్‌లో అర్దరాత్రి హత్య సంచలనం రేపింది. ఓ వివాహితను అత్యంత దారుణంగా చంపేశారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. సాయి ఎన్‌క్లేవ్‌లో అర్దరాత్రి హత్య సంచలనం రేపింది. ఓ వివాహితను అత్యంత దారుణంగా చంపేశారు. ఆపై డెడ్ బాడీపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి పారిపోయాడో దుండగుడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడాన్ని చూసి స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలియక.. భయపడిపోయారు. ఆ వెంటనే పోలీసులకు ఫోన్ చేసిన సమాచారమిచ్చారు. హుటాహుటిన స్పాట్‌కి చేరుకున్న పోలీసులు కాలిపోతున్న డెడ్‌బాడీ చూసి షాకయ్యారు. అసలేం జరిగిందనే దానిపై ఆరా తీశారు. శంషాబాద్‌లో గల సాయి ఎన్‌క్లేవ్‌ జనంతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. కానీ, అర్థరాత్రి వేళ ఓ మహిళను చంపేసి, ఆమె శరీరానికి నిప్పటించారు. స్కూటీపై బాడీని తీసుకువచ్చి ఓపెన్ ప్లాట్‌లో తగలబెట్టినట్లు సీసీటీవీ విజువల్స్‌లో కనిపిస్తోంది. ఇంత కిరాతకం వెనుక అసలు రీజనేంటి? అని అన్ని కోణాల్లోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page